‘అమృతం’ సీరియర్ ద్వితీయం ట్రైలర్.

0
53

గుణ్ణం గంగరాజు నిర్మాతగా జస్ట్ ఎల్లో బ్యానర్‌పై ‘అమృతం’ టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. అప్పట్లో అమృతం సీరియల్ ఓ సంచలనం.ఇప్పటికే ఎన్నో ఛానెల్స్‌ ఈ సీరియల్ ప్రసార హక్కులు కొని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేసినపుడల్ల ఈ సీరియల్‌కు భారీ టీఆర్పీ రేటింగ్స్ వస్తూనే ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే తెలుగు టెలివిజన్ సీరియల్ చరిత్రలో ‘అమృతం’ ఓ క్లాసిక్‌లా నిలిచిపోయింది. 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సీరియల్ ఎంతో మంది ప్రేక్షకులను అలరిచింది. ఓ హోటల్ చుట్టూ తిరిగే కథలతో అల్లుకున్న ఎపిసోడ్స్ తో వారం వారం తెలుగువారిని గిలిగింతలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ ప్రస్తుతం 30 నుండి 40 ఏళ్ల వయసు ఉన్న చాలామందికి అభిమాన సీరియల్. ఎప్పుడెప్పుడు అమృతం కొత్త ఎపిసోడ్ వస్తుందా అంటూ ఎదురు చూసేవారు అప్పట్లో.అమృతం సీరియల్‌ను ఆ మధ్య ఈటీవీ ప్లస్‌లో పున: ప్రసారం చేశారు. అయితే అమృతంకు వస్తున్న ఆదరణ చూసి జీ తెలుగు వారు అమృతం వెబ్ సిరీస్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. అమృతం 2 అనే టైటిల్ తోనే ఇది ప్రసారం కాబోతుంది.


అమృతం పాత్రలో శివాజీ రాజా కొన్నాళ్లు.. నరేష్ కొన్నాళ్లు.. ఆ తర్వాత హర్షవర్ధన్ చేశారు. అయితే ఎక్కువగా హర్షవర్దన్ అమృతం పాత్రలో నటించడంతో అమృతం అనగానే ఆయనే గుర్తుకు వస్తుంటారు. అందుకే తాజాగా వస్తోన్న అమృతం 2 కు కూడా అమృతరావు పాత్రలో హర్షవర్ధన్‌ను తీసుకున్నారు. తాజాగా ఈ సీరియల్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్‌లో విడుదల చేసారు. అంతేకాదు ‘అమృతం ద్వితీయం అద్భుతీయం అంటూ అమృతం సీరియల్ గొప్పతనాన్ని తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కన్నీళ్లు తెప్పించే సీరియల్స్ ఉన్న కాలంలో కామెడీతో ఈ షో ఒక చరిత్ర సృష్టించిందన్నారు. అంతేకాదు ఐదు సార్లు ప్రసారమైన ఏకైక సీరియర్. 270 మిలియన్ వ్యూస్.. గడిచిన కొద్ది నెలలుగా 6 మిలియన్ వ్యూస్ సాధించిన సీరియల్ అంటూ చెప్పుకొచ్చారు.