నిర్భయ దోషుల పిటిషన్ కొట్టివేత. ఉరి అమలు.

0
64

ఉరి శిక్షను నిలిపివేయాలంటూ నిర్భయ కేసులో దోషులు పెట్టుకున్న పిటిషన్లను ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది. దీంతో నిర్భయ దోషులకు రేపు (ఈనెల 20)న ఉరి శిక్ష అమలు కానుంది. 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. దోషులు పవన్, ముఖేష్, అక్షయ్,  వినయ్ శర్మలకు ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. తమ ఉరిశిక్షను నిలిపివేయాలంటూ నిర్భయ దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను పాటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది. దీంతో వారి ఉరితీతకు ఎలాంటి ఆటంకం ఉండబోదని నిర్భయ తరఫు న్యాయవాది సీమా కుష్వాహా అన్నారు. ‘రేపు ఉదయం 5.30 గంటలకు ఆ నలుగురికి ఉరిశిక్ష అమలవుతుందని విశ్వసిస్తున్నా.’ అని సీమా కుష్వాహా చెప్పారు.