టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దలకు ఏపీ రాజధాని రైతుల నుంచి నిరసన సెగ.

0
66

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైయిన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులెవరు ఆయనతో పెద్దగా కలిసింది లేదు.  తాజాగా ఏపీలో సినిమా షూటింగ్స్ నిమిత్తం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ  పెద్దలు జగన్‌ను కలవడం ఇదే తొలిసారని చెప్పాలి. మధ్యలో ఒకసారి చిరంజీవి సీఎం జగన్‌ను కలిసినా… ఆయన తన సైరా సినిమా చూడాలని కోరేందుకు సీఎం జగన్‌ను కలిశారు. వైఎస్ జగన్ సీఎం కావడం సినీ పరిశ్రమలో చాలామందికి ఇష్టం లేదని… అందుకే ఆయనను కలిసి అభినందించేందుకు టాలీవుడ్‌ పెద్దలు ముందుకు రావడం లేదని గతంలో నటుడు పృధ్వీ విమర్శలు కూడా గుప్పించారు. అయితే ఈ విమర్శలను టాలీవుడ్ పెద్దలు ఖండించారు. అయితే కరోనా కారణంగా ఏడాది తరువాత సీఎం జగన్‌ను టాలీవుడ్ పెద్దలు కలుస్తుండటంతో… ఈ భేటీపై అందరి దృష్టి నెలకొంది. తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందకు అమరావతి వచ్చిన టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జునతో పాటు సినీ ఇండస్ట్రీ పెద్దలకు రాజధాని అమరావతి రైతుల నుంచి నిరసన వ్యక్తం అయింది.

అమరావతి రాజధాని మద్దతుగా సినీ ప్రముఖులు కలిసి రావాలని వాళ్లు బస చేసిన గెస్ట్ హౌస్ బయట అమరావతి జేఏసీ ప్రతినిధులు నిరసనకు దిగారు. తెలుగు సినిమాకు సంబంధించిన విషయమై వారంత ఏపీ సీఎం జగన్‌ను కలవడం ఆనందదాయకమని .. రాజధాని కోసం 175 రోజులుగా రైతులు చేస్తోన్న తమ ఉద్యమానికి కూడా మద్దతు తెలపాలని కోరారు. సినీ పెద్దలకు ఏపీలో స్టూడియోలు కట్టుకోవడానికి భూములు కావాలే కానీ.. రాజధాని రైతుల సమస్యలు పట్టవా అంటూ అక్కడి రైతులు టాలీవుడ్ పెద్దలు ప్రశ్నిస్తున్నారు.