ప్రముఖ లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం.

0
38

ప్రముఖ లేడీ దర్శకరాలు సంజనా రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈమె గతంలో రాజ్ తరుణ్ హీరోగా ‘ రాజుగాడు’  అనే సినిమాతో దర్శకురాలిగా మారింది. అంతకు ముందు ఈమె జర్నలిస్టుగా కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసింది. ఈమె త్వరలో కరణం మల్లీశ్వరి పై తెరకెక్కే బయోపిక్‌ను డైరెక్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. కరణం మల్లీశ్వరి బర్త్ డే సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ కూడా విడుదల చేసారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈమె జ్వరంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ అయింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచినట్టు సమాచారం. ఈమె విషయమైన ప్రముఖ రచయత కోన వెంకట్ మాట్లాడుతూ.. ఆమె గత మూడు రోజులుగా ద్రవాహారం తీసుకుంటున్నట్టు చెప్పారు. మొత్తానికి ఆమె తిరిగి ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుందాం.