పదో తరగతి పరీక్షలపై పవన్ కీలక వ్యాఖ్యలు.

0
59

కరోనా వైరస్ రోజురోజూకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడంపై జనసేన అదినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జూలై 10 నుంచి పదో తరగత పరీక్షలు నిర్వహిస్తుండడంపై విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి వారితో చెలగాటం ఆడడం ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిదికాదన్నారు. పొరుగు రాష్ట్రాలపై తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్‌గడ్ వంటి రాష్ట్రాలు ఎక్కడా పరీక్షలు నిర్వహించినా దాఖలాల్లేవని ఆయన పేర్కొన్నారు. చివరకు ఉన్నత విద్య పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణలో హైకోర్టు సైతం విద్యార్థులకు పరీక్షల నిర్వహణను ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజూకీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఇప్పటికే ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. దీనికితోడు ప్రజారవాణ సైతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ కోరారు. ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలనే ఏపీలోనూ అనుసరించాలని తెలిపారు.