మహేష్ కు మళ్ళీ షాక్ !!

0
102

ఏసియన్ సినిమాస్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్‌బాబు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోయే ఇంటీరియర్ డిజైన్ తో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌కు జనాలు విపరీతం గా వస్తున్నారు. ఐతే ఇలాంటి సమయం లో ఏఎంబీ సినిమాస్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. కొత్తగా అమలులోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలను ఏఎంబీ సినిమాస్ అమలు చేయడం లేదని తేలినట్టు సమాచరం.100కు పైగా టికెట్ ధర ఉన్న థియేటర్లలో జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఐతే దీనిని ఏఎంబీ సినిమాస్‌ ఫాలో అవ్వకపోవడం గుర్తించిన అధికారులు ఏఎంబీ సినిమాస్‌కు నోటీసులు పంపారని వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఏసియన్ గ్రూప్ ప్రతినిధి సునీల్‌, అధికారులు తనిఖీలు చేసిన విషయం వాస్తవమేనని, అయితే, నోటీసులు మాత్రం ఇవ్వలేదని చెప్పినట్టు సమాచారం.