రైతు కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ: జగన్

0
43

సీఎం చంద్రబాబు కొండవీడు పర్యటన సందర్భంగా రైతు కోటయ్య మరణించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటన పై టీడీపీ, వైసీపీ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం హెలికాప్టర్ దిగేందుకు రైతు కోటయ్య పంటను ధ్వంసం చేశారని..పోలీసుల దౌర్జన్యం వల్లే రైతు చనిపోయాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యం లో వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి కూడా కామెంట్ చేశారు.

“కొండవీడులో ఒక బీసీ(ముత్రాసి) రైతు, కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ. కొట్టి కొనఊపిరితో వున్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ?” అంటూ తమ ట్విట్టర్ అకౌంట్ నుండి మండిపడ్డారు.