మేడ్చల్: అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు.

0
370

మేడ్చల్ జిల్లా.కాప్రా మండలం జవహర్ నగర్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 808లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన కాప్రా రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై క్రిమినల్ చర్యలు చేపడుతామని తహశీల్దార్ ఈ.బి. నాగరాజు హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూముల్లో భూకబ్జా దారుల చెర నుండి రక్షిస్తామని చెప్పారు తహశీల్దార్ ఈ.బి. నాగరాజు.