కాశ్మీర్ బిలాంగ్స్‌ టు ఇండియా : ఇలా ముద్రించండి… పాక్‌కు తిక్క కుదురుతుంది

0
129

భారత్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని భావిస్తున్న పాకిస్థాన్ తిక్కకుదర్చాలంటే ఒక్క పని చేయాలని భారత సర్కారుకు ఇజ్రాయెల్ ప్రభుత్వ ఓ చక్కని ఐడియా ఇచ్చింది. భారత ప్రభుత్వం ముద్రించే కొత్త కరెన్సీ నోట్లపై కాశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియా (కాశ్మీర్‌ భారత్‌దే) అని ముద్రించాలని సలహా ఇచ్చింది. కాశ్మీర్ భారత్‌దేనన్న నిజాన్ని అంగీకరించని పాక్ ఆ వాక్యాలను కరెన్సీ నోట్లపై ప్రింట్ చేయడానికి ఏమాత్రం అంగీకరించదని ఫలితంగా నకిలీ నోట్ల బెడద తప్పుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత్‌కు సలహా ఇచ్చింది. అయితే, ఇలా సలహా ఇచ్చినట్టు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి భారత ప్రభుత్వానికి ఇజ్రాయెల్ ఆ విధంగా సలహా ఇచ్చిందో లేదో తెలియదుకానీ, ఈ ఐడియా మాత్రం చాలా అద్భుతంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. పైగా, ఈ సలహాను తక్షణం అమలు చేయాలని వారు సలహా ఇస్తున్నారు.