సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఏప్రిల్ నెలాఖరున మహర్షి సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అనుకున్న పనులు పూర్తికాకపోవడం వల్లనే విడుదల వాయిదా అనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని సన్నివేశాలు అనుకున్నట్టుగా రాకపోవడం వలన .. భావోద్వేగాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వలన అసంతృప్తికి లోనైన మహేశ్ బాబు, రీ షూట్ చేయమని చెప్పాడట. అందువల్లనే విడుదల తేదీ మారుతుందని చెప్పుకుంటున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -