”మహర్షి” సినిమాను రీషూట్ చేస్తారా ?

0
48

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్‌ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఏప్రిల్ నెలాఖరున మహర్షి సినిమా రిలీజ్‌ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్‌ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అనుకున్న పనులు పూర్తికాకపోవడం వల్లనే విడుదల వాయిదా అనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని సన్నివేశాలు అనుకున్నట్టుగా రాకపోవడం వలన .. భావోద్వేగాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వలన అసంతృప్తికి లోనైన మహేశ్ బాబు, రీ షూట్ చేయమని చెప్పాడట. అందువల్లనే విడుదల తేదీ మారుతుందని చెప్పుకుంటున్నారు.