బ్రేకింగ్: శిఖా చౌదరిపై ఫిర్యాదు.. కేసు నమోదు

0
30

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాకేశ్ రెడ్డి కారుతో పాటు అతని బ్యాంకు ఖాతా వివరాలు, కొన్ని కీలక పత్రాలను అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలియజేశారు. దర్యాప్తు కీలక దశలో ఉందనీ, విచారణ పూర్తయిన తర్వత పూర్తి వివరాలను మీడియాకు చెబుతామన్నారు. చిగురుపాటి జయరాం హత్య జరిగాక అతని ఇంటికెళ్లి విలువైన పత్రాలను శిఖా చౌదరి తీసుకెళ్లిందని ఆయన భార్య పద్మ… హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ 448 సెక్షన్ కింద శిఖాపై కేసు నమోదు చేశారు.