టీ-20 సిరీస్‌ ఓటమి.. వన్డేతో సరిగ్గా సమాధానమిచ్చిన టీమిండియా

0
72

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయభేరి మోగించింది. ట్వంటీ-20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులిచ్చింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన టీమిండియా 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఆటగాళ్లలో కోహ్లీ 44 పరుగులు, ధోనీ 59, కేదార్ జాదవ్ 81 పరుగులు సాధించారు.

అంతకుముందు… టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓవర్లన్నీ ఆడినా ఏడు వికెట్లకు 236 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ ఖవాజా 50, స్టోయినిస్ 37, మ్యాక్స్ వెల్ 40 పరుగులు సాధించారు. వికెట్ కీపర్ క్యారీ 36 పరుగులు చేశాడు.

భారత బౌలర్లలో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లతో ఆసీస్‌ను కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత్ ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును కేదార్ జాదవ్ 81 పరుగులతో తన ఖాతాలో వేసుకున్నాడు.