మొన్నటికి మొన్న జనసేనాని పవన్ కల్యాణ్పై మండిపడిన టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని.. ప్రస్తుతం వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగే జగన్ను ఏపీ ప్రజలు నమ్మరని యామిని విమర్శించారు.
గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో యామిని మాట్లాడుతూ.. డేటా చౌర్యం, ఫారం-7, కోడికత్తి వంటి డ్రామాలాడటంలో జగన్ను మించిన వారు లేరన్నారు. ఏప్రిల్ 11న ఓటు వేసి.. మరుసటి రోజే కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి జగన్ది అని సాధినేని యామిని వెల్లడించారు.
ఐదు కోట్ల మంది కలల సౌధమైన రాజధాని నగరం అమరావతిని.. భ్రమరావతి అంటూ హేళన చేయడం తప్ప ఐదేళ్లయినా ఏపీకి మకాం మార్చడం చేతకాని జగన్ అంటూ విరుచుకుపడ్డారు.