“ఆర్ఆర్ఆర్‌”లో ఎన్టీఆర్ జోడీగా శ్రద్ధా కపూర్..

0
78

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ ప్రధాన పాత్రల్లో ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో భారీ మల్టీ స్టారర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది జూలై 30 తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.

అయితే, ఇటీవలే ఎన్టీఆర్‌కు జోడిగా బ్రిటన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. కానీ, ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంది. ప్రస్తుతం ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

అయితే ఆ పాత్రకు బాలీవుడ్ నటి అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిణీతి చోప్రా ఆ తర్వాత నిత్యా మీనన్ పేర్లు బయటకు వచ్చాయి. కానీ తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఆమే, “సాహో” భామ శ్రద్ధా కపూర్. ఆమె అయితే ఎన్టీఆర్‌కు జోడిగా సరిగ్గా సరిపోతుందని అంతా భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.