భారతీయ జనతా పార్టీ తరపున తూర్పు ఢిల్లీ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన నామినేషన్ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరిచాడు.
అఫిడవిట్ ప్రకారం గంభీర్ మొత్తం ఆస్తుల విలువ రూ.147 కోట్లు. క్రికెట్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుల రూపంలో వచ్చిన వాహనాలతో కలిపి ఆయనకు గంభీర్కు 5 కార్లు, 2 బైక్స్ ఉన్నాయి. గంభీర్ భార్య నటాషా కూడా వ్యాపారం ద్వారా రూ.6.15 లక్షల ఆదాయం సంపాదించింది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.12.40 కోట్ల ఆదాయాన్ని గంభీర్ తన ఆఫిడవిట్లో చూపించాడు. ఇక.. ఢిల్లీ బరిలో ఉన్న 349 మంది అభ్యర్థుల్లో గంభీరే అత్యంత ధనిక అభ్యర్థి కావడం గమనార్హం.