సారీ రాజమౌళి సర్.. మీతో కలిసి ప్రయాణించలేను: శ్రద్ధా కపూర్

0
59

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తుంటే, వారికి సరసన అలియా భట్, బ్రిటన్ నటి లూసీ ఎడ్గర్ జోన్స్‌లను ఎంపిక చేశారు. కానీ, బ్రిటన్ భామ తన వ్యక్తిగత కారణాల రీత్యా తప్పుకుంది.

ఆమె స్థానంలో హీరోయిన్ కోసం వేట కొనసాగుతూ ఉంది. ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రముఖ హీరోయిన్లను దర్శకుడు సంప్రదిస్తూనే ఉన్నారు. బ్రిటన్ నటి స్థానంలో తొలుత బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ను నటింపజేయాలని రాజమౌళి అనుకున్నారట.

ఈ మేరకు ఆయన శ్రద్ధాతో సంప్రదించినట్టుగా సమాచారం. అయితే ఆమె అందుకు నో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియా ఈ విషయాన్ని చెబుతూ ఉంది. శ్రద్ధ ఈ సినిమాలో నటించేందుకు ఎందుకు నో చెబుతోందనే అంశం గురించి కూడా బాలీవుడ్ మీడియానే క్లారిటీ ఇస్తోంది.

ఇది భారీ ప్రాజెక్ట్ కావడం.. ఎక్కువ రోజుల పాటు ఈ సినిమా రూపకల్పనకు సమయం పట్టడం వంటి రీజన్లతో శ్రద్ధ ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పిందట. ఇప్పటికే శ్రద్ధా కపూర్ ‘సాహో’ సినిమాలో నటిస్తోంది. అది కూడా భారీ బడ్జెట్ సినిమానే. ఆ ప్రాజెక్టు నుంచి శ్రద్ధ బయటపడనే లేదు. ఇంతలోనే మరో భారీ ప్రాజెక్టులో నటించడం అంటే.. రెస్టు లేకుండా పోతుందనే ఉద్దేశంతోనే శ్రద్ధా కపూర్ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు సమాచారం.