తెలుగు హీరోయిన్ బిందుమాధవి. కానీ, తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా, ‘కళుగు’ అనే తమిళ సినిమాలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది.
అనేక మంది సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కాయి. అయితే ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు లేక కనుమరుగైపోయిన ఈమెకు.. అదృష్టం తలుపు తట్టింది.
కోలీవుడ్లో పేరున్న దర్శకుడు బాలా ఎప్పుడూ వాస్తవిక సినిమాలు చేస్తుంటారు. వీటిలో నటులెంత వాళ్లైనా పాత్రలే కనిపిస్తాయి. బాలా యువ హీరోలతో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సూర్య హీరోగా చిత్రం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. బాలా చెప్పిన కథ సూర్యకు బాగా నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్కు బ్రేక్ పడింది.
దీంతో బాలా సినిమాలో ప్రస్తుతం నటించలేనని సూర్య చెప్పడంతో ఆయన మరో కథను తయారు చేసుకున్నారు. ఇందులో హీరోలుగా ఆర్య, అధర్వ నటిస్తున్నారు.
ఈ సినిమాలో బిందుమాధవికి నటించే అవకాశం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ అయితే, బిందుమాధవి దశ తిరిగినట్టేనని టాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు.