టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్. లండన్కు చెందిన మైకేల్ కోర్సెలేతో ప్రేమలో పడింది. కొన్ని నెలలుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. మైకేల్ కోసం శృతి.. అనేకసార్లు ఒంటరిగా చెన్నై నుంచి లండన్కు వెళ్లింది.
అతనితో కొద్దిరోజులు గడిపిన తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చింది. పైగా, కమల్ హాసన్ ఇంటిలో జరిగిన అనేక ఫంక్షన్లకు కూడా మైకేల్ హాజరయ్యాడు. కమల్ – శృతిలతో కలిసి ఫోటోలు దిగారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది.
ఇంతలోనే ఈ ప్రేమజంట విడిపోయింది. ‘దురదృష్టవశాత్తూ… జీవితం మమ్మల్ని ఈ భూగోళానికి వ్యతిరేక దిశల్లో ఉంచింది. కాబట్టి… జీవిత ప్రయాణంలో మేం ఒంటరి దారుల్లో నడవాల్సి వస్తోంది.
కానీ, ఈ యంగ్ లేడీ ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్గానే ఉంటుంది. తనను నా స్నేహితురాలిగా పొందినందుకు ఎప్పటికీ గొప్పగా భావిస్తా. లవ్ యు గాళ్’ అని మైకేల్ ఓ ట్వీట్ చేశాడు. పైగా, శ్రుతీహాసన్తో తాను కలిసి దిగిన ఫోటోను జతచేశాడు.
అయితే, ఎందుకు బ్రేకప్ అవుతున్నామనేది చెప్పకుండానే… బ్రేకప్ అయినట్టు చెప్పేశాడు. దీంతో వీరిద్దరి ప్రేమకథకు ఫుల్స్టాప్ పడిందని ప్రేక్షకులందరికీ అర్థమైంది. బ్రేకప్ విషయమై శ్రుతీహాసన్ ఇంకా స్పందించలేదు.
ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా 2016లో వీరిద్దరికీ పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత ప్రేమలో పడ్డారు. ప్రేమలో ఉన్న సమయంలో శ్రుతీహాసన్ సినిమాలనూ తగ్గించేశారు. కొంత విరామం తర్వాత ఇటీవలే విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం అంగీకరించారామె. సో… మరో సెలెబ్రిటీ ప్రేమ జంట విడిపోయింది.