రాఘవలారెన్స్ దర్శకత్వంలో వచ్చిన సీక్వెల్ చిత్రం కాంచన. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు చిత్రాలు వస్తే మూడూ బ్లాక్బస్టర్ హిట్స్ సాధించాయి. దీంతో ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ విభిన్నమైన పాత్రలో నటించనున్నారనే ప్రచారం సాగుతోంది.
కాంచ చిత్రాన్ని హిందీలోకి ‘లక్ష్మీబాంబ్’ పేరుతో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. నిజానికి తమిళ, తెలుగు ‘కాంచన’లో శరత్ కుమార్ హిజ్రాగా నటించారు. ఇప్పుడు ఈ పాత్రనే హిందీలో అమితాబ్ బచ్చన్తో చేయించాలని లారెన్స్ భావిస్తున్నారట.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్తో కూడా సంప్రదించినట్లు సమాచారం. అయితే అమితాబ్ బచ్చన్ ఒప్పుకున్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ హిజ్రా పాత్రలో బిగ్బీ నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు చిత్రబృందం కూడా అధికారికంగా ప్రకటించలేదు.
మరోవైపు, ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం హీరో అక్షయ్ కుమార్ను లారెన్స్ ఎంపిక చేశారు. అక్షయ్కు జోడీగా కియారా అడ్వానీ నటించనున్నారు. మాధవన్, శోభితా ధూలిపాళ్ల కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా రాఘవ లారెన్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.