హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్: ఎండ్గేమ్’ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ చిత్రం దెబ్బకు బాక్సాఫీసు బద్దలైపోయింది. ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.వేల కోట్లు వసూలు చేసింది.
గతంలో వచ్చిన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీవార్’కు కొనసాగింపుగా ‘అవెంజర్స్: ఎండ్గేమ్’ వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 26వ తేదీన విడుదలైంది. ఈ సినిమా మూడు రోజుల్లో 1.2 బిలియన్ డాలర్లు (రూ.8,384 కోట్లు) కొల్లగొట్టి, చరిత్ర సృష్టించింది.
అనేక దేశాల్లో పాత రికార్డులను చెరిపేసింది. కేవలం అమెరికా, కెనడాలో గురువారం రాత్రి నుంచి ఆదివారం వరకు 350 మిలియన్ డాలర్లు రాబట్టినట్లు డిస్నీ నిర్మాణ సంస్థ అంచనా వేసింది. అదేవిధంగా చైనా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, ఇతర 38 దేశాల్లో సినిమా వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది.
చైనాలో ‘ఎండ్గేమ్’ 330.5 మిలియన్ డాలర్లు సాధించింది. ‘అవెంజర్స్: ఎండ్గేమ్’ భారత్లో మూడు రోజుల్లో రూ.157.20 కోట్లు (2845 స్క్రీన్లు) రాబట్టింది. శుక్రవారం రూ.53.10 కోట్లు, శనివారం రూ.51.40 కోట్లు, ఆదివారం రూ.52.70 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇవి ‘అవెంజర్స్: ఇన్ఫినిటీవార్’ (భారత్లో) వసూళ్ల కంటే 66.07 శాతం ఎక్కువ కావడం విశేషం. ఆంటోని రుస్సో, జో రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.