మోడీ మోడీ ఎస్ పప్పా.. ఎనీ డెవలప్‌మెంట్ నో పప్పా.. ప్రధానిపై ఆర్జేడీ వ్యంగ్య పద్యం

0
60

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీహార్ రాష్ట్రంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీ వినూత్నంగా విమర్శలు గుప్పించింది. చిన్నారులు పాడుకునే జానీ జానీ ఎస్ పప్పా పద్యాన్ని పేరడీ చేసి మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

భవిష్యత్తులో మోడీ భక్తుల పిల్లలు ఈ పద్యాన్ని నేర్చుకుంటారు.. “మోడీ మోడీ ఎస్ పప్పా.. ఎనీ డెవలప్‌మెంట్.. నో పప్పా.. ఫార్మర్ హ్యాపీ.. నో పప్పా, విమెన్ సేఫ్.. నో పప్పా.. 10 క్రోర్ జాబ్.. నో పప్పా.. 15 ల్యాక్స్.. నో పప్పా.. ఓన్లీ జుమ్లా.. హ హ హ” అని ఆర్జేడీ ట్వీట్ చేసింది.

బీహార్‌లో బీజేపీ, జేడీయూకి వ్యతిరేకంగా, ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర విపక్షాలు మహాకూటమి ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. మొత్తం 40 లోక్‌సభ స్థానాలున్న బీహార్‌లో ఏడు విడుతల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఆర్జేడీ బలమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. గత ఎన్నికల్లో నితీశ్ కుమార్‌ – లాలూ ప్రసాద్ యాదవ్ కలిసి పోటీ చేసి విజయభేరీ మోగించారు. కానీ, నితీశ్ కుమార్ నమ్మక ద్రోహం చేసి బీజేపీ చెంత చేరడంతో ఆర్జేడీ అధికారానికి దూరమైన విషయం తెల్సిందే.