రైతుల కోసం విశాల్ రూ.1 స్కీమ్

0
57

గతంలో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం “టెంపర్”. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమిళ హీరో విశాల్ రీమేక్ చేస్తున్నాడు. “అయోగ్యన్” పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

అయితే, గతంలో చేసినట్లుగానే ఈ సినిమా కోసం విశాల్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినిమాకు కొనుగోలు చేసిన టికెట్‌ ధర నుంచి ఒక రూపాయిని రైతులకు ఇస్తున్నట్లు విశాల్ ప్రకటించాడు.

గతంలో “పందెం కోడి”, “అభిమన్యుడు” తదితర చిత్రాలకు కూడా విశాల్ ఇలాగే రైతులకు విరాళం ఇచ్చాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్. సి.ఎస్. సంగీతం సమకూర్చగా, రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది.