టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా. ‘బాహుబలి’ తర్వాత ఆమె నటించిన “ఎఫ్-2” చిత్రంతో మళ్లీ తెరపైకివచ్చింది. పైగా, బాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది. ఆ చిత్రం పేరు “ఖామోషీ”.
ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, రీసెంట్గా టీజర్ విడుదల చేసి అంచనాలు పెంచిన యూనిట్ తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేసింది. ఇందులోని సన్నివేశాలు సినిమాపై చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మూవీ మంచి హిట్ ఖాయమని నెటిజన్స్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో చక్రి తోలేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లోనే సెట్స్పైకి వెళ్ళిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో బధిర పాత్రలో తమన్నా నటిస్తుంటే.. చీకటి గదిలో తీసిన సన్నివేశాల్లో ఈమె రెచ్చిపోయి రొమాన్స్ చేసిందట.
చిత్రంలో ప్రభుదేవా, భూమిక, సంజయ్ సూరీ, మురళీ శర్మ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. చిత్రంలో ప్రభుదేవా సైకో పాత్రలో కనిపించి బయపెట్టించనున్నాడు. హారర్, థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా బాణీలు అందించారు.