హీరో మహేశ్ బాబు నటించిన చిత్రం “మహర్షి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అద్భుత నటనతో పాటు అందచందాలు ఆరబోసింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ విజయవాడలో జరిగింది. ఇందులో ఆమె కూడా పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహేష్కి మైలు రాయిలాంటి చిత్రమిది. ఇందులో నాకూ భాగం ఉన్నందుకు ఆనందంగా ఉంది. తనతో మళ్లీ పనిచేయాలని ఉంది. మహేశ్ నిజంగానే సూపర్ స్టార్ అని కితాబిచ్చింది.
ఆ తర్వాత దర్శకుడు వంశీపైడిపల్లి మాట్లాడుతూ, అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా తీస్తానని విడుదలకు ముందే చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. మహేష్తో పనిచేసిన మూడేళ్లు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకీ ఈ సినిమాని అంకితం చేస్తున్నా అని అన్నారు.