చాలామంది సినీ నటీలు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత గుడ్డు పెట్టే కోడిలా గంపకింద దాక్కున్నారు అంటూ సినీ నటి శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. నిన్నామొన్నటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ఆ తర్వాత సీనియర్ నటుడు కె. మురళీమోహన్పై సెటైర్లు వేసింది. వంకర మాటలు మాట్లాడితే అన్ని వంచేస్తాడు అంటూ కిండల్గా మాట్లాడింది.
ఇపుడు, పవన్ కళ్యాణ్ వీరాభిమాని, కమెడియన్ కమ్ హీరో షకలక శంకర్ను ఘాటుగా విమర్శించింది. ఎన్నికల ముగిసిన తర్వాత గుడ్డు పెట్టే కోడిలాగా గంపకింద దాక్కున్నాడు అంటూ షకలక శంకర్ను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టింది. యితే శంకర్ని ఎందుకు టార్గెట్ చేసిందంటే.. ఆ మధ్య ఓసారి తన సినిమా ప్రమోషన్లో భాగంగా శ్రీరెడ్డిని ఉద్దేశించి శంకర్ పరోక్షంగా విమర్శలు చేశాడు.
కొంత కాలంగా సైలెంట్గా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ తన నోటికి పని చేబుతుందని.. ఈసారి ఎంత మందినటి టార్గెట్ చేస్తుందో అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా, క్యాస్టింగ్ కౌచ్ ద్వారా శ్రీరెడ్డి మంచి పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెల్సిందే.