మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో ప్రధాన హీరోయిన్గా నయనతార నటిస్తోది. అలాగే, ఇతర చిన్నచిన్న పాత్రల్లో పలువురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇలాంటివారిలో మిల్కీబ్యూటీ తమన్నా, స్వీటీ అనుష్క, విద్యాబాలన్ ఇలా పలువురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారన్నది ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్.
అయితే, ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. దీంతో చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనునంది. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. చిరూ సరసన హీరోయిన్ శ్రుతి హాసన్ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర వుందట. ఈ పాత్రను అనసూయతో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొరటాల ఆమెను సంప్రదించడం.. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయట. ఇందుకోసం అనసూయకి భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ కూడా ఇవ్వబోతున్నారట.