మరదలిపై అక్కమొగుడి అఘాయిత్యం..

0
78

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మరదలిపై బావ అత్యాచారం చేశాడు. పదో తరగతి చదువుతున్న ఆమెను బెదిరించి ఆరేళ్లుగా బాలికపై తన పైశాచికం ప్రదర్శించాడు. చివరకు బాలిక గర్భవతి కావడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

ప్రియుడు ఆమెను గర్భవతిని చేశాడని… వెంటనే అబార్షన్ చేయాలని డాక్టర్లకు చెప్పాడు. దీంతో అతడి వ్యవహారం పట్ల వైద్యులకు అనుమానం వచ్చింద. దీంతో డాక్టర్లు వెంటనే మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా కురుత్తన్ గోడు సమీపంలో ఓ గ్రామానికి చెందిన అయ్యప్పన్‌కు 30 ఏళ్లు. భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయ్యప్పన్ భార్యకు ఓ చెల్లి కూడా ఉంది. ఆమెకు 10వ తరగతి చదువుతోంది. అతనిపై అయ్యప్పన్ కన్నుపడింది. మరదలిని బెదిరించాడు. లైంగిక దాడికి తెగబడ్డాడు.

దీంతో ఆమె గర్భవతి కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు. అయ్యప్పన్ తీరుపై అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యప్పన్ పరారవ్వడంతో పోలీసులు అతడిని వెతికి పట్టుకున్నారు. అయ్యప్పన్‌పై పోక్సో చట్టంలో కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు.