మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

0
38

పుణె: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. పుణె నగర శివార్లలో శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. పుణె- షోలాపూర్ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఓ లారీ కదంవక్ వాస్తి గ్రామ సమీపాన ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 9 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులంతా పుణె నగర సమీపంలోని యవత్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.