చిరంజీవి, జగన్ భేటీ. ట్వీట్ చేసిన రామ్‌గోపాల్ వర్మ..

0
35

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలవడం గురించి అటు టాలీవుడ్‌లోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ భేటీ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. సోషల్ మీడియాలో కూడా ఈ టాపిక్కే ట్రెండింగ్‌లో నిలిచింది. పలు వాయిదాలు పడిన ఈ కార్యక్రమం ఎట్టకేలకు సోమవారం పూర్తయింది. సోమవారం మధ్యాహ్నం చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. చిరు దంపతులను సాదరంగా ఆహ్వానించిన జగన్.. వారితో కలిసి లంచ్ కూడా చేశారు. ఈ భేటీపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. `వావ్.. 151తో 151` అంటూ ట్వీట్ చేశారు. 151 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్‌తో 151 సినిమాలు చేసిన చిరంజీవి కలయిక అని అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ చేశారు.