కశ్మీర్లోని పుల్వామాలోని అవంతిపొర ప్రాంతంలో గురువారం (ఫిబ్రవరి 14) మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ కాన్వాప్పై ఉగ్రదాడి జరిగిందన్న విషయం తెలిసిందే. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఖండించారు. ఈ దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు.