చిన్నారి నరికి రక్తం తాగిన మేనత్త

0
45

ఏపీలోని విశాఖ మన్యంలోని పెదబయలు మండలం లకేయుపుట్టులో మంగళవారం ఒక దారుణ సంఘటన చోటుచేసుకున్నది. లక్ష్మీపేట పంచాయతీ కప్పాడు గ్రామానికి చెందిన ఓ వంతాల రస్మో అనే మహిళ కొన్ని రోజులుగా తమ్ముడి ఇంట్లో ఉంటున్నది. అయితే నాలుగు రోజుల నుంచి ఆమెకు ఆమె తమ్ముడి భార్య తో గొడవలు మొదలయ్యాయి. ఇంట్లోనుండి వెళ్ళిపోమంటూ వంతాల రస్మో ని వేధించడం మొదలుపెట్టారు. దీంతో వంతాల రస్మో తమ్ముడి భార్యపై కక్ష కట్టింది, తమ్ముడి పాపను చంపుతానని హెచ్చరించింది. అన్నట్టుగానే మంగళవారం ఉదయం తన తమ్ముడి కుమార్తె కొర్ర అనిత అనే ఆరేళ్ళ పాపను కొండపైకి తీసుకెళ్లింది. అక్కడ కట్టెలు నరికే కత్తితో చిన్నారిపై దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత చిన్నారి రక్తాన్ని తాగేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు కొండపైకి వెళ్లి చూడగా చిన్నారి అప్పటికే మృతి చెందింది. దీంతో గ్రామస్థులు నిందితురాలిని పట్టుకొని చెట్టుకు కట్టేసి పోలీసులకి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.