ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులు చెప్పిన నిజాలు … షాక్ లో పోలీసులు

0
39

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో మరిన్ని నిజాలు తెరపైకి వస్తున్నాయి. ఆమె హత్యకు సంబంధించి ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే… ఒళ్లు గగొర్పొడిచేలా అయ్యేలా చేస్తోంది. వీడింది. ఆమెను రేప్ చేసి చంపేసిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే ఈ కేసు విచారణలో నిందితులు చెప్పిన విషయాలు … పోలీసుల్ని సైతం షాక్ అయ్యేలా చేస్తున్నాయి.

ప్రియాంక స్కూటీ పంక్చర్ చేయిస్తానని స్కూటీని తీసుకెళ్లిన నిందితుడి కోసం ఆమె వేచి చూస్తుండగా మిగతా నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. షాక్ నుంచి తేరుకున్న వైద్యురాలు ‘హెల్ప్.. హెల్ప్’ అని పలుమార్లు అరిచింది. అయితే, వాహనాల శబ్దం కారణంగా ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. నోరునొక్కి నిర్మానుష్య ప్రదేశానికి ఆమెను లాక్కెళ్లిన కాసేపటికే స్కూటీ తీసుకెళ్లిన నిందితుడు కూడా వారితో కలిశాడు.

అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితురాలు ప్రతిఘటించకుండా ఉండేందుకు బలవంతంగా ప్రియాంక నోరు తెరిచి నోట్లో మద్యం పోశారు. దాదాపు 45 నిమిషాలపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేసిన నిందితులు ఆ తర్వాత ముక్కు, నోరు మూయడంతో ప్రాణాలు కోల్పోయింది. అంతేకాదు, పోలీసులు వెల్లడించిన మరో విషయం గగుర్పాటుకు గురిచేస్తోంది. మృతదేహాన్ని లారీలో తరలిస్తున్న క్రమంలోనూ పలుసార్లు ప్రియాంక డెబ్ బాడీపై కూడా అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని లారీలోకి ఎక్కించే క్రమంలో ప్యాంటు లేదని, ఆ తర్వాత ఓ నిందితుడు కిందికెళ్లి ప్యాంటు తెచ్చి తొడిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.