కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలానికి చెందిన టీడీపీ నేత సుబ్బారావును ఆయన ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేశారు. సుబ్బారావును వేటకొడవళ్లతో నరికి చంపారు. రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు.. ఆయనను చుట్టుముట్టి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. దీంతో సుబ్బారావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కొలిమిగుండ్ల మండలం బెలూంగుహల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సుబ్బారావు స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె. కొంతకాలంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్న సుబ్బారావుకు గనుల విషయంలో మరో వర్గంతో గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా లావాదేవీల విషయంలో సుబ్బారావుకు మరో వర్గంతో విభేదాలు మొదలయ్యాయాని సమాచారం. ఈ నేపథ్యంలో వాళ్లే సుబ్బారావును హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు… ఘటనాస్థలానికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -