కర్నూలు జిల్లాలో దారుణం. టీడీపీ నేత హత్య.

0
36

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలానికి చెందిన టీడీపీ నేత సుబ్బారావును ఆయన ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేశారు. సుబ్బారావును వేటకొడవళ్లతో నరికి చంపారు. రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు.. ఆయనను చుట్టుముట్టి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. దీంతో సుబ్బారావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కొలిమిగుండ్ల మండలం బెలూంగుహల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సుబ్బారావు స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె. కొంతకాలంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్న సుబ్బారావుకు గనుల విషయంలో మరో వర్గంతో గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా లావాదేవీల విషయంలో సుబ్బారావుకు మరో వర్గంతో విభేదాలు మొదలయ్యాయాని సమాచారం. ఈ నేపథ్యంలో వాళ్లే సుబ్బారావును హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు… ఘటనాస్థలానికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు.