వాళ్ల సినిమాలు చూడటం మానేస్తే… వారే దిగివస్తారు. నిర్మాత సంచలన వ్యాఖ్యలు.

0
56

మూడు రాజధానులపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన ఆయన… ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం చిరంజీవికి ఆయనకు తెలియదా ? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లు సంపాదిస్తారని… ఆయన సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నారో చిరంజీవికి తెలియదా ? అని అన్నారు.పృథ్వీ హాస్యనటుడని… ఆయన మాటలకు విలువ ఇవ్వాల్సిన పని లేదని అశ్వినీదత్ అన్నారు.

పృథ్వీ లాంటి వారి వల్లే జగన్ భ్రష్టు పట్టిపోతున్నారని ఆరోపించారు. మద్దతు కోసం సినీ హీరోలను రైతులు అడ్డుకోవాల్సిన అవసరం లేదని… వాళ్ల సినిమాలు చూడటం మానేస్తే… వారే దిగివస్తారని అన్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్ స్టార్లుగా ఉన్నారన్న అశ్వినీదత్… నటుడిగా కాకున్నా… సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా ? అని వ్యాఖ్యానించారు. జగన్ వాళ్ల నాన్న చేసిన దాంట్లో 10 శాంత చేసినా గొప్ప సీఎం అవుతారని అశ్వినీదత్ అన్నారు.

బొత్స ఏం మాట్లాడుతున్నారో ఆయన కుటుంబసభ్యులకే అర్థంకావడం లేదని విమర్శించారు. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు భూములిస్తే ప్రతిగా రాజధానిలో భూములిచ్చారని తెలిపారు. ఇప్పుడు ఎయిర్ పోర్టు విస్తరించారని… ఆ భూములను ఎలా తిరిగిస్తారని ప్రశ్నించారు. రాజధాని రైతులను చూస్తే ఆవేదన కలుగుతోందని అశ్వినీదత్ అన్నారు.