అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విజయ్ !

0
36

జమ్ముకశ్మీర్‌లో పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్ల పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది
అమరులైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేసి..దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశాడు. అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన bharatkeveer.gov.in వెబ్ సైట్ ని కూడా షేర్ చేసాడు.

“జవాన్ మన కుటుంబాలను రక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. మనవంతు సాయం మనం చేద్దాం. నావంతు సహకారం నేను అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికి సపోర్ట్ సిస్టం గా నిలుద్దాం” అని ట్వీట్ చేశాడు.