పోసాని కృష్ణమురళికి మూడు పదవులు ఆఫర్ చేసిన వైఎస్ జగన్.

0
29

వైఎస్ జగన్ తనకు మూడు పదవులు ఆఫర్ చేశారంటున్నారు నటుడు పోసాని కృష్ణమురళి. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. జగన్ తనకు ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ ఆఫర్ చేశారని.. తాను మాత్రం సున్నితంగా తిరస్కరించానన్నారు. జగన్ సన్నిహితులు తన ఇంటికి వచ్చారని.. తనకు సినిమాలు ఇష్టం, ప్రశాంతంగా బతకడం ఇష్టం.. అలాగే రాజకీయాలు ఇష్టమే కానీ పదవులు ఇష్టం లేదు.. కేవలం మద్దతు ఇస్తానని మాత్రం చెప్పానన్నారు.

తాను సమాధానం విని జగన్ గారు నవ్వుకున్నారని తర్వాత తెలిసిందన్నారు పోసాని. ఆ తర్వాత కూడా పోసాని పదవి ఎందుకు వద్దంటున్నారు.. వెళ్లి మాట్లాడి రమ్మని మరో వ్యక్తిని తన ఇంటికి పంపించారని.. గంటసేపు తనతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. తాను చచ్చే వరకు జగన్ ప్రేమతో మాట్లాడితే చాలని తన ఇంటికి వచ్చిన వ్యక్తితో చెప్పానని.. తనకు ఆ గౌరవం ఉంటే చాలన్నారు. పదవులపై తనకు ఆసక్తి లేదంటున్నారు కృష్ణమురళి.

ఇక ప్రజారాజ్యం సమయంలో కూడా ఎమ్మెల్యే టికెట్ అడగలేదన్నారు పోసాని. చిరంజీవి గారు మురళీ అసెంబ్లీలో ఉంటే బాగా మాట్లాడతారని భావించి టికెట్ ఇచ్చారని.. పవన్, నాగబాబు, చిరు చర్చించుకొని నిర్ణయానికి వచ్చారన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్న విషయం కూడా టీవీలో చూసి తెలుసుకున్నానని.. ఆ వెంటనే బీఫామ్ ఇచ్చారు.. మరుసటి రోజు నామినేషన్ వేశానని పాత విషయాలను గుర్తు చేశారు.