నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరార్…

0
33

నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. వీరికి ఈ నెల 22న ఉరిశిక్ష వేయాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ… వివిధ సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంతో… వీరికి ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష వేయాలని నిర్ణయించారు. నిన్న ముఖేశ్ సింగ్ పిటిషన్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించి, కేంద్ర హోం శాఖకు పంపించారు. దాన్ని కేంద్ర హోం శాఖ పరిశీలించి.. దోషికి క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం లేదని రాష్ట్రపతికి వివరించింది. దీంతో.. రాష్ట్రపతి కూడా ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో నిందితులకు ఉరిశిక్ష ఖరారైంది.

2012లో నిర్భయపై నిందితులు ముకేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు.