ఆ పని వల్ల బండ్ల గణేష్‌కు ఎదురు దెబ్బ.

0
46

కామెడీ నటుడు నుంచి నిర్మాతగా మారి టాలీవుడ్ బడా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’, ఎన్టీఆర్‌తో ‘టెంపర్’, ‘బాద్షా’ రామ్ చరణ్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’ లాంటి సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత  రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో కాస్త హడావుడి చేసిన బండ్ల గణేష్.. తీరా రిజల్ట్స్ వచ్చాకా సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత రాజకీయాల్లోంచి పూర్తిగా పక్కకు తప్పుకుంటున్నట్టు ప్రకటించి తన వ్యాపారం ఏదో తను చేసుకుంటున్నాడు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు.  సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల గణేష్ ఓ దొంగ పాత్రలో నటించారు. సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాల్లో బండ్ల గణేష్ కొద్ది నిముషాలు కనిపించి నవ్వించాడు. ఇదిలావుంటే ఈ సినిమాలో బండ్ల గణేష్ చేసిన క్యారెక్టర్ చాలామందికి నచ్చలేదు అనే టాక్.  అదీ కాక మరీ అంత తక్కువ నిడివి ఉండటం..పోనీ అది కూడా పూర్తి స్థాయిలో హ్యాస్యాన్ని పండించకపోవడంతో బండ్ల గణేష్‌కు రీ ఎంట్రీలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి.

ఈ విషయంపై ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడికి, బండ్ల గణేష్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు సమాచారం. తన క్యారెక్టర్ ను సుమారు ఎనబై శాతం తొలగించడం పై బండ్ల గణేష్ ఆవేదన చెబుతున్నారట. ఇలా తొలగించే ఉద్దేశ్యం ఉన్నప్పుడు మొత్తం తన పాత్రను తొలగించినా ఆవేదన చెందేవాడిని కాదు అంటూ ఫీల్ అవుతున్నాడట గణేష్. మొత్తానికి అనిల్ రావిపూడి చేసిన పని వల్ల తన పరువుపోయిందని భాధ పడుతున్నాడు బండ్ల గణేష్.