రైతులకు శుభవార్త..9 వేలు సాయం ప్రకటించిన చంద్రబాబు

0
34

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకి ఓ శుభవార్త చెప్పారు. ఐదు ఎకరాలలోపు ఉన్న అన్నదాతలకు రూ.9 వేలు సాయం ప్రకటించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సాయం కాకుండా.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద 9 వేలు అదనంగా ఇస్తున్నట్టు చంద్రబాబు అనౌన్స్ చేశారు. అలాగే ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు 10 వేలను రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని తెలియజేసారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలో రైతులకు భారీ ప్రయోజనం చేకూరనుంది.