జయరాం హత్య కేసు లో రోజుకో మలుపు

0
32

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అటు తిరిగి.. ఇటు తిరిగి చివరికి పోలీసుల కి తలా నొప్పి గా మారింది. ఇప్పటికే ఈ కేసు లో ప్రధాన నిందితుడైన రాకేష్ ని కస్టడీ లోకి తీసుకొని విచారిస్తున్నారన్న విషయం తెలిసిందే కదా. ఐతే ఈ కేసులో రాయదుర్గం సీఐ రాంబాబు పాత్ర కూడా ఉన్నట్టు దర్యాప్తు లో తేలింది. రాంబాబుతో రాకేశ్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డికి సాయం అందించిన పలువురు పోలీసులపై ఇప్పటికే వేటు పడింది. తాజాగా, మరో పోలీసు అధికారిపైనా వేటు పడింది.