మేడ్చల్ లో నీటి కోసం ధర్నా

0
46

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో గతకొంత కాలంగా మంజీరా, గ్రామపంచాయతీ నీరు రావడంలేదని 108 కాలనీల ప్రజలు ధర్నాకి దిగారు. నాగారం నుండి రాంపల్లి చౌరస్తా వరకు 500 మంది మహిళలు, పురుషులతో కలిసి ర్యాలీ లో పాల్గున్నారు.

నాగారం గ్రామపంచాయతీ సర్పంచ్, కార్యదర్శితో పాటు జలమండలి అధికారులెవరూ పట్టించుకోవడం లేదని జనాలు మండిపడుతున్నారు. ప్రభుత్వం, గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.