జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి చాలా మంది భారతీయులు ముందుకొస్తున్నారు. విరాళాలు అందజేస్తున్నారు. ఎవరిరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల వ్యక్తిగత విరాళం అందచేసినట్లు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.
హైదరాబాద్లోని సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ హెడ్ క్వార్టర్ను సందర్శించిన కేటీఆర్.. అమరులైన జవాన్లకు నివాళులు అర్పించి.. ఆ తర్వాత రూ.25 లక్షల చెక్ను ఉన్నతాధికారులకు అందజేశారు. అలాగే తన మిత్రులు ఇచ్చిన రూ.25 లక్షల చెక్ ని కూడా అందజేశారు.