కాజల్ అగర్వాల్‌ ఇంట్లో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కారణం ఏంటి .?

0
34

సౌత్ టాప్ స్టార్ కాజల్ అగర్వాల్‌‌కు చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తెలుగు, తమిళ సినీ వర్గాల్లో కలకలం రేగుతోంది. రీసెంట్‌గా భారతీయుడు 2 సినిమా షూటింగ్ సమయంలో దర్శక, నిర్మాతలు ప్రొడక్షన్ టీమ్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.ఈ ఘటనలో పలువురు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 19న ఈవీపీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఈ దుర్ఘటపై దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. చిత్ర యూనిట్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాద ఘటన జరిగిందనే దానిపై చెన్నై పోలీసులు ‘భారతీయుడు 2’ చిత్ర యూనిట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పటికే చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లైకా ప్రొడక్షన్స్ వాళ్లతో పాటు దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌ను ఎగ్మోర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసుకు పిలిపించి విచారణ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కాజల్ అగర్వాల్‌కు చెన్నై పోలీసులు సమన్లు అందజేసినట్టు సమాచారం.అంతేకాదు ఈ ఘటనపై ఆమెను ప్రశ్నించడానికి ఇప్పటికే పోలీసులు ప్రశ్నావళి రూపొందించినట్టు చెబుతున్నారు.